జి కిషన్ రెడ్డి పలు తెలుగు సినిమా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్

జి కిషన్ రెడ్డి  పలు తెలుగు సినిమా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్


 ఈ కాన్ఫరెన్స్ లో కరోన కాలంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో తో చర్చ నిర్వహించారు.ఇందులో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ,డైరెక్టర్ తేజ ,జెమిని కిరణ్ ,త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల ,అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు మంత్రి దృష్టికి షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటిటి లో సినిమా రిలీజ్, రీజనల్ జిఎస్టి,tds, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ పలు అంశాలు తెచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ షూటింగ్లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని అలానే అంతర్జాతీయ సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా నిర్మాణం జరిగేలా రీజినల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని, సినిమా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం పవర్ మినిస్టర్ తో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు .జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్లు ,స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా సీఎం లతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలుగు తమిళ హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు.

Post a Comment

0 Comments